Venkatesh1

Mar 27 2024, 06:50

గ్రామాల్లో అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలు.. మీ ఆశీస్సులతో గెలిపించండి. అభివృద్ధి చేసి చూపిస్తా.. ఎమ్మెల్యే ఎం. వీరాంజనేయులు..

గ్రామాల్లో అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలు.. మీ ఆశీస్సులతో గెలిపించండి.. తోడుగా ఉంటా.. అభివృద్ధి చేసి చూపిస్తా.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

శింగనమల నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటలో ఉంటా..ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో మీ బిడ్డగా ఆశీర్వదించి అఖండ మెజారిటీతో నన్ను ఎమ్మెల్యే గా గెలిపించండి..అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఎం. వీరాంజ నేయులు కోరారు. 

పుట్లూరు మండలం మడుగుపల్లి, జంగం రెడ్డిపల్లి, ఎల్లుట్ల గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన చేపట్టారు.

ముందుగా గ్రామాల్లో పార్టీ నాయకులు, ప్రజలు మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులతో కలసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ మీ సోదరుడిగా మీ ముందుకు వస్తున్నా, ఆశీస్సులు అందించాలని కోరారు. 

డప్పు కళాకారులతో కలసి డప్పు దరువు వాయించారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, మీ అమూల్యమైన ఓటును 'ఫ్యాన్ " గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కరపత్రాలను అందించి అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగనన్న గెలుపొందాలన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పాఠశాలల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి కార్పొరేట్ విద్య కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తూ, దేశ చరిత్రలో నిలిచిన జగనన్నకు రుణపడి ఉంటామని మహిళలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా, సంక్షేమ పథకాలు అందించి తమ కష్టాలు తీర్చిన జగనన్నకే తమ ఓటు వేసి ఆయన రుణం తీర్చుకుంటామని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని సంక్షేమం ఆపకుండా అందరికీ అందించి తోడుగా ఉన్నారన్నారు. ప్రజలు కరోన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. జగనన్న ప్రజల శ్రేయస్సు కోసం శ్రమిస్తుంటే, మనమందరం కూడా ఆయనని రానున్న ఎన్నికలలో సమిష్టిగా కృషి చేసి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.  నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు,తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 26 2024, 16:04

మృతి చెందిన టిడిపి సీనియర్ కార్యకర్త గారి కుటుంబానికి అండగా నిలబడి ఆర్థిక సాయం చేసిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడు..

సింగనమల నియోజకవర్గం నార్పల మండలం బండ్లపల్లి గ్రామం టీడీపీ సీనియర్ కార్యకర్త తలారి ఓబుళప్ప అనారోగ్యం తో అకస్మాత్తుగా మృతి చెందడం తో ఆ విషయం ఆ గ్రామ సీనియర్ నాయకుల ద్వారా తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు 10,000 వేల రూ.లు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం లో పిట్టు రంగారెడ్డి,G సుధాకర్ రెడ్డి,పిట్టు వెంకటనారాయణమ్మ,K సాంబశివరెడ్డి,తలారి కుళ్లాయప్ప,నారాయణ స్వామి,పెద్దన్న,రఘురాములు తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 26 2024, 10:36

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం బొందలవాడ గ్రామంలో నిన్నటి రోజున బీసీ కాలనీలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు ఈ కార్యక్రమంలో బొందలవాడ గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Mar 26 2024, 07:54

28వ తేదీన వస్తున్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన కోసం ఏర్పాట్లను చూస్తున్న టిడిపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ..

2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలానికి ఈనెల 28 తేదీన వచ్చేస్తున్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న శుభ సందర్భంగా సభా స్థలాన్ని మరియు ఏర్పాట్లను పరిశీలిస్తున్న టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ మరియు ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి రామలింగారెడ్డి పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Mar 26 2024, 07:44

నార్పల మండలం గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి గ్రామాలలో విస్తృత ప్రచారం చేపట్టిన రాష్ట్ర అధికార ప్రతినిధి విశబ్ కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు..

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి గ్రామాలలో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు, ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ  బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారు అనంతరం రిజర్వేషన్లను పెంచి పదవుల్ని ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు అనంతరం వైయస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లను నీరుగార్చిన ద్రోహి జగన్ అంటూ మండిపడ్డారు, ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరు ఏకతాటిపై ఉంటూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి బండారు శ్రావణి శ్రీ గారి ని ఏమ్మెల్యే గా గెలిపించుకొని నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి గా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ  అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 26 2024, 07:37

సమస్యల పరిష్కార దిశగా పని చేస్తా దీవించి ఆశీర్వదించండి బండారు శ్రావణి శ్రీ..

సమస్యల పరిష్కార దిశగా పని చేస్తా దీవించి ఆశీర్వదించండి బండారు శ్రావణి శ్రీ..

గ్రామాల్లో అపూర్వస్వాగతం పలుకుతున్న మీకు శతకోటి వందనాలు

మీరు చూపించే ప్రేమ, ప్రేమ ఆప్యాయతలు ఎన్నటికీ మరువలేనివి

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉత్సాహంతో పని చేస్తాను..

నా ధైర్యం,బలం ప్రజలే, నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజలతోనే ఉంటా ప్రజల మధ్యనే తిరుగుతా.

మీకోసం ఎటువంటి సమస్యలు ఉన్నా మీ తరపున పోరాడడానికి నేను సిద్దం..

ప్రతి ఇంటిలో ఆడపడుచుల మీలో ఒక్కరిగా నిత్యం అందుబాటులో ఉంటాను.

ప్రజల వెంట తిరిగాను ప్రతి ఊరు ప్రచారం చేశాను మీ సమ్యస  నాకు తెలుసు ఎక్కడ ఏ సమస్య ఉందో నేను ఆరాధిస్తున్నాను.. "మీరు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయత". నాకోసం మండే ఎండలు లెక్క చేయకుండా మీరు మాకోసం ప్రచారం చేస్తూ మా వెంట నడుస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను..

Venkatesh1

Mar 26 2024, 07:18

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాం.. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాం.. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని ఎం.వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండలం " మన ఊరికి మన వీరా" ఎన్నిక ప్రచారం అనంతరం నాగులగుడ్డం తండా గ్రామంలో మూడవ రోజు "పల్లె నిద్ర" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

స్థానిక గ్రామస్తులతో మమేకమవుతూ, సమావేశం నిర్వహించి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఇంటింటికి అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాలనలో తమ కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాయని సంతోషంగా ఉన్నామని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

అనంతరం వీరాంజనేయులు గ్రామంలో బస చేశారు.

Venkatesh1

Mar 26 2024, 07:09

సంక్షేమ పథకాలతో ఆనందంగా ఉన్నాం.. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటున్న ప్రజలు..శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

సంక్షేమ పథకాలతో ఆనందంగా ఉన్నాం.. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటున్న ప్రజలు.. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా జగనన్నదే విజయం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజలు ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి జగనన్నను గెలిపించుకుంటామన్నారని ఎం. వీరాంజనేయులు, ఎం. శంకర్ నారాయణ అన్నారు. 

శింగనమల మండలం లోలూరు, రఘునాథపురం, ఆకులేడు, నాగులగుడ్డం, నాగులగుడ్డం తండా గ్రామాల్లో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య, ఆలూరు సాంబ శివారెడ్డితో కలసి వీరాంజనేయులు, శంకర్ నారాయణ, చేపట్టారు. 

ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలలతో సన్మానించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను, అవ్వ తాతలను పలకరిస్తూ వైఎస్సార్సీపీ చేసిన మేలును వివరించారు. వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, రాబోయే ఎన్నికలలో ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన జగనన్నదే విజయమన్నారు. టిడిపి, జనసేన, బిజెపితో పాటు ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నినా జగనన్నని తాకలేరన్నారు. గత టిడిపి పాలనలో పాలకులు దోచుకోవడానికి మాత్రమే పరిపాలించారన్నారు. వైఎస్ఆర్సిపి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరిస్తుందన్నారు. వెళ్లిన ప్రతి గ్రామంలో సంక్షేమం కనిపిస్తోందని, టిడిపి ఎన్ని కూటములతో వచ్చినా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు వారి మాటను తెలియజేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎంత మందితో వచ్చినా జగనన్న సింగల్ గా అఖండ మెజారిటీతో మళ్లీ తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పల్లెనిద్ర ద్వారా గ్రామాల్లోని ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ వారితో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకొని ఆ గ్రామాల్లో బస చేయడం వల్ల ప్రజలకు మరింత దగ్గర అవడం ఎంతో సంతోషం ఇస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చాక చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తారని ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Mar 25 2024, 07:47

28న బీకేఎస్ లో చంద్రబాబు పర్యటనకు సభవేదిక ఖరారు..

28న బీకేఎస్ లో చంద్రబాబు పర్యటనకు సభవేదిక ఖరారు..

 స్థలం పరిశీలించిన ప్రజాగళం రాష్ట్ర కోఆర్డినేటర్ రాజశేఖర్ , టూమెన్ కమిటీ సభ్యులు ఆలం, కేశవరెడ్డి పలువురు టీడీపీ నేతలు 

( శింగనమల నియోజక వర్గం) 

 శింగనమల నియోజకవర్గంలో ఈ నెల 28న ప్రజాగళం పేరుతో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు పర్యటన బుక్కరాయసముద్రంలో ఖరారు అయి ంది. ఇందుకు సంబంధించి ఆదివారం ప్రజాగళం రాష్ట్ర కోఆర్డినేటర్ రాజశేఖర్ బాబు ద్విసభ్యకమిటీ సభ్యులు అలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షుడు పసుపుల హనుమం తురెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు,కన్వీనర్ అశోక్ లు సభావేదిక స్థలంను పరిశీలించడం జరిగింది. బుక్కరాయసముద్రం పరిధిలోని తాడిపత్రి రోడ్డులో 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పక్కనే వేదిక ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 28న రాప్తాడు. నియోజకవరం పర్యటన అనంతరం మద్యాహ్నం 3గంటలకు బుక్కరాయసముద్రంలో సమావేశం ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు.

Venkatesh1

Mar 25 2024, 07:40

ముమ్మాటికీ.. జగన్ సర్కారే హత్యలు.. ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్యలు బాధాకరం..

ముమ్మాటికీ.. జగన్ సర్కారే హత్యలు.. ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్యలు బాధాకరం.. 

బీసీలంతా సీఎం జగన్ ని వ్యతిరేకించాలి.. (శింగనమల నియోజకవర్గం )

వైసిపి దాష్టీ కానికి ఓ చేనేత కుటుంబం బలైంది. కడప జిల్లాలో ఒంటిమిట్ట గ్రామంలో జరిగిన ఘటనకు ఘటన ఇది ఆత్మహత్యలు కాదు... ముమ్మాటికీ జగన్ సర్కారే చేసిన హత్యనేనని సింగనమల నియోజకవర్గం టిడిపి నేతలు ఆరోపించారు.

ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట కొత్త మాధవరంలో రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనపై సింగనమల నియోజకవర్గం టూ మెన్ కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటిమడు కేశవరెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యనిర్వ కార్యదర్శి రామలింగారెడ్డి జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు పసుపుల హనుమంతురెడ్డి ,జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు , కన్వీనర్ అశోక్ స్పందించారు. ఆదివారం బుక్కరాయసముద్రం పెద్దమ్మ గుడి సర్కిల్ వద్ద కొవ్వొత్తులు తో ర్యాలీ చేసి వారి కుటుంబానికి శ్రద్ధాంజలి ప్రకటించి అనంతరం మాట్లాడారు .ప్రభుత్వ దాష్టీకానికి ఓ చేనేత కుటుంబం బలైపోయిందని ఆరోపించారు. వైసీపీ నేతల కబ్జాకాండ నిండు కుటుంబం ఉసురు తీసిందని టీడిపి నేతలు ఆరోపించారు. కబ్జారాయుళ్లతో పోరాడలేక బీసీ కుటుంబం ప్రాణాలు తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాటలకందని విషాదం ప్రతి ఒక్కరినీ ఆందోళనలో పడేస్తోందని తెలిపారు. కొత్త మాధవరంలో జరిగిన ఈ ఘటనకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు? ఎంత ఆవేదన చెందితే ఇలా ప్రాణాలు తీసుకుంటారో తెలుసా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటనపై స్పందించి ఆత్మహత్య కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగనమల నియోజకవర్గం టిడిపి నేతలు డిమాండ్ చేశారు.

 వైసీపీ నేతల భూ కబ్జాలకు కుటుంబం బలి నియోజవర్గం టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ 

వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట కొత్త మాధవరంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం పట్ల టీడీపీ సింగనమల నియోజకవర్గం అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాల సుబ్బారావు, భార్య పద్మావతి, చిన్న కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వారి భూమిని కబ్జా చేయడంతోనే ఆ చేనేత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ జగన్ సర్కారు చేసిన హత్యేనని ధ్వజమెత్తారు. ఈ మేరకు పాల సుబ్బారావు కుటుంబానికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బండారు శ్రావణి శ్రీ డిమాండ్ చేశారు. బీసీలపై జగన్ అండతో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ మూకలను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని నియోజవర్గం టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ డిమాండ్ చేశారు